ఆదివారం బిగ్ బాస్ షో చాలా ఆసక్తికరంగా సాగింది. చిన్న చిన్న ఆటలు, కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ తో పాటు, ఎలిమినేషన్ వరకు చాలా బాగా జరిగింది. నాగార్జున బిగ్ బాస్ షోని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆదివారం బిగ్ బాస్ లో కొన్ని సంఘటనలు హైలైత్ గా నిలిచాయి. ముఖ్యంగా ముగ్గురి ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. అలా చేసింది వాళ్ళేనా అనుకునేలా నమ్మశక్యం కాకుండా ఉంది. ఆ విషయాలే బిగ్ బాస్ లో హైలైట్ గా నిలిచాయి.



మొదటగా బాబా భాస్కర్, గత పది వారాల నుండి వారాంతంలో నాగార్జున వచ్చినపుడు కనిపించే ఎనర్జీ ఈ వారంలో అస్సలు కనిపించలేదు. నాగార్జున క్లాస్ పీకినప్పటి నుండి బాగా ఫీల్ అయినట్టున్నాడు. పూర్తిగా డిప్రెస్ గా కనిపించాడు.దీంతో ఆయన అభిమానులు కలత చెందారు. మరి తర్వాతి వారాంతంలోనైనా మునుపటి ఎనర్జీని కనబరుస్తారేమో చూడాలి.


ఇక శివజ్యోతి, రవి ఎలిమినేట్ అయ్యాక శివజ్యోతి బాగా ఎమోషనల్ అవుతుందని భావించారు. కానీ శివజ్యోతి తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంది. ఏడవకుండా ఉండడానికి చాలా ప్రయత్నించింది. ఇక మూడోది శ్రీముఖి, మొదటి నుండి శ్రీముఖి గేమ్ ని చాలా తెలివిగా ఆడుతుంది. అయితే ఆమె వేసే ఎత్తులు అందరికీ అ౦ర్థం కావు. శ్రీముఖి, కిస్ అండ్ కిల్ గేమ్ లో శ్రీముఖి ఒక ప్రొఫెషనల్ గేమర్ లా ప్రవర్తించింది. ఆలీని కిల్ చేస్తూ ఆమె చెప్పిన కారణం హైలైట్ గా నిలిచింది.


ఆలీ, శ్రీముఖి మంచి స్నేహితులు. ఆలీ రీ ఎంట్రీ ఆమెకి సంతోషాన్నే ఇచ్చినప్పటికీ గేమ్ మీద చాలా ప్రభావాన్ని చూపించింది.  అతనికి బయట బిగ్ బాస్ హౌస్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అంతా తెలుసు.దానివల్ల అతని ఆటలో మార్పు వస్తుందని చెప్పి ఆలీని కిల్ చేసింది. ఇక వితికాకి కిస్ ఇవ్వడం కూడా ఆశ్చర్యమే. రాహుల్, వరుణ్ ల  గొడవకి ముందు వితికాతో శ్రీముఖికి పెద్దగా స్నేహం లేదు. ఆ గొడవ తర్వాతనే వీరు దగ్గరయ్యారు.  ఈ మూడు అంశాలు బిగ్ బాస్ లో హైలైట్ గా నిలిచాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: