చిరంజీవి మెగా స్టార్ కావడానికి మాస్ ప్రేక్షకులు అందించిన వీరాభిమానమే అతడిని ఈ స్థాయిలో కూర్చో పెట్టాయి. వాస్తవానికి చిరంజీవికి ఉన్న సినిమాల పిచ్చి ప్రభావమే చిరంజీవిని క్రేజీ హీరోగా మార్చింది అని అంటారు. చిరంజీవిని కడుపున మోస్తూ తొమ్మిది నెలలు నిండిన సమయంలో కూడ అంజనా దేవి సినిమాలను చూసిందట. 

ఆ సినిమాల వ్యామోహమే తనకు వచ్చింది అని అంటాడు చిరంజీవి. ‘సైరా’ ఫస్ట్ కాపీని అందరికంటే ముందుగా చూసిన అంజనాదేవి చిరంజీవిని ఒక వింత కోరిక కోరిందని స్వయంగా చిరంజీవి లీక్ చేసాడు. ‘సైరా’ సినిమాను తాను మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో చూడనని తాను ఆ సినిమాను ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని సింగిల్ ధియేటర్ లో మాస్ ప్రేక్షకుల మధ్య కూర్చుని మొదటిరోజు మొదటి షోను చూస్తానని తన కోరికను బయటపెట్టిన విషయం చిరంజీవి తెలియ చేసాడు. 

అంతేకాదు అభిమానుల కేకలు ఈలలు మధ్య తాను ‘సైరా’ మూవీని చూస్తానని అందువల్ల తనను అలాంటి ధియేటర్ కు పంపించమని చిరంజీవిని అంజనాదేవి అడిగిందట. ఇదే సందర్భంలో చిరంజీవి మరొక ట్విస్ట్ ఇచ్చాడు.

తన భార్య సురేఖ ‘సైరా’ మూవీ రిజల్ట్ గురించి తనకన్నా ఎక్కువగా టెన్షన్ పడుతున్న విషయాలను వివరిస్తూ ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. చిరంజీవి ఎంత పెద్ద హీరోని అయినప్పటికీ అదేవిధంగా తన భార్యను తల్లిగా భావించే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయినప్పటికీ తనను నిర్మాతగా చేయలేదనీ తన భార్య సురేఖ బాథ పడుతోందనీ అయితే తన కోరికను తాను చెప్పకుండానే తనను నిర్మాతగా మార్చిన రామ్ చరణ్ తనకన్నా పవన్ కన్నా చాల మంచివాడు అంటూ ఆమె ఈమధ్య తన పై సెటైర్లు వేస్తోంది అంటూ చిరంజీవి జోక్ చేసాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: