మెగాస్టార్ చిరంజీవి నటించిన  భారీ బడ్జెట్ చిత్రం  సైరా  మరో రెండు రోజుల్లో   థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్లు ,టైటిల్ సాంగ్ చిత్రంపై భారీ అంచనాలను తీసుకొచ్చాయి. ఇక ఈ చిత్రంలో  ఇంటర్వెల్ ఎప్పుడో పడనుందో చెప్పేశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.  అన్ని భాషల్లో  డిటిఎస్  మిక్స్ అయిపోయిన సందర్బంగా  ప్రముఖ  డిటిఎస్  మిక్సర్  తపస్ నాయక్  తో కలిసి దిగిన ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేశాడు సురేందర్ రెడ్డి.  ఆఫోటో  వెనకాల వున్న  స్క్రీన్ లోనే   సైరా  ఇంటర్వెల్ సీన్ వుంది. ఆసీన్ లో  ఎతైన కొండలపై కూర్చొని  చిరంజీవి   ధాన్యం చేస్తుండగా  కింద వార్ బిగిన్స్ నౌ అని వుంది.  దాన్ని బట్టి  అక్కడే ఇంటర్వెల్ కార్డు  పడనుందని అర్ధమవుతుంది. 



పీరియాడికల్  బ్యాక్ డ్రాప్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా  తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా   అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు , సుధీప్ , తమన్నా  ముఖ్య పాత్రలు పోషించారు.   బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రాన్ని  సుమారు 270 కోట్ల  భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ నిర్మించాడు. ఈచిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి  సందర్భంగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ , మలయాళ , హిందీ భాషల్లో భారీస్థాయిలో  విడుదలకానుంది. ఇక  ఈచిత్రానికి  హిందీలో హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్  కలిసి నటించిన  వార్  నుండి  గట్టి పోటీఎదురుకానుంది. వార్ కూడా అదే రోజువిడుదలకానున్నడం  అలాగే ఆ చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉండడంతో సైరా కు  అక్కడ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టడం అంత ఈజీ కాకపోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: