పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు , సుధీప్ , తమన్నా ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుమారు 270 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ నిర్మించాడు. ఈచిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ , మలయాళ , హిందీ భాషల్లో భారీస్థాయిలో విడుదలకానుంది. ఇక ఈచిత్రానికి హిందీలో హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ నుండి గట్టి పోటీఎదురుకానుంది. వార్ కూడా అదే రోజువిడుదలకానున్నడం అలాగే ఆ చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉండడంతో సైరా కు అక్కడ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టడం అంత ఈజీ కాకపోవచ్చు.