త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న అల వైకుంఠపురం లో  సినిమాలో  యంగ్ హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే .సుశాంత్ కాళిదాసు  సినిమా తో తెలుగు తెరకు  పరిచయమయ్యాడు.ఆ తరువాత ఆయన నటించిన కరెంట్ సినిమా మంచి విజయం సాధించింది.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో పెద్ద పాత్రను  పోషించింది. ఈ సినిమాలో  సుశాంత్ డ్యాన్స్  అందరిని చాలా బాగా ఆకట్టుకుంది   .తరువాత  సుశాంత్ నటించిన  మూడు సినిమాలు సరిగా ఆడలేదు.2018 లో యంగ్ హీరో రాహుల్ దర్శకత్వంలో వచ్చిన చి॥ ల॥ సౌ॥ సినిమా లో హీరోగా నటించాడు.ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు  ను అనౌన్స్ చేశారు.

గత కొన్ని రోజుల నుండి  సుశాంత్  బన్నికి సోదరుడి గా నటిస్తున్నారని కొందరు.. కాదు పూజా హెగ్డే కి సోదరుడిగా నటిస్తున్నాడని మరికొందరు అంటున్నారు . ఈ విషయం పై  సుశాంత్ స్పందించారు.  అల వైకుంఠపురంలో   సినిమా లో నేను బన్నీ కి సోదరుడిని కాదు అలాగానీ పూజా హెగ్డే కి సోదరుడిని కూడా కాదు అని చెప్పాడు. ఈ సినిమా లో తన పాత్ర గురించి తెలుసుకోవాలంటే కొంత కాలం వెయిట్ చేయండి అన్నారు.

ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు  రీసెంట్ గా రిలీజ్ చేసిన సామజవరగమన పాటకు మంచి ఆదారణ వస్తుంది.బన్నీ మరియు రాహుల్ రామకృష్ణ మధ్యలో వచ్చే సన్నివేశాలు అందరిని చాలా బాగా ఆకట్టుకుంటాయని టాక్.అల వైకుంఠపురం లో  టబు,జయరామ్, నివేత పేతురాజ్, నవదీప్  లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా  ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: