సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. భరత్ అనే నేను, మహర్షి సినిమాల బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న మహేష్ సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన మరో క్రేజీ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.   


సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. అయితే సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని అడిగారట. ఆమె కూడా అందుకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఐటం సాంగ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఈమధ్య దేవి తన మార్క్ మ్యూజిక్ అందించడం లేదని విమర్శలు వచ్చాయి.    


అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఓ అదిరిపోయే ఆల్బం అందిస్తున్నాడట డిఎస్పి. అంతేకాదు స్పెషల్ గా ఐటం సాంగ్ కోసం చేసిన ట్యూన్ దుమ్ముదులిపేస్తుందట. ఈ సాంగ్ గురించి తమన్నా కూడా చెప్పడం విశేషం. ప్రస్తుతం సైరా ప్రమోషన్స్ లో ఉన్న తమన్నా మహేష్ తో స్పెషల్ సాంగ్ చేస్తున్నానని.. ఆ సాంగ్ చూస్తే ఈలలు.. గోలలు చేసేస్తారని.. థియేటర్ మోత మోగాల్సిందే అంటూ ఆ సాంగ్ పై అంచనాలు పెంచింది.


ట్యూన్ రెడీ అవగా మహేష్, తమన్నా సాంగ్ డిసెంబర్ లో షూట్ చేస్తారని తెలుస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పొంగల్ వార్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా వస్తుంది. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: