అక్కినేని వారసుడిగా 2008 లో కాళిదాసు చిత్రం ద్వారా చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు సుశాంత్.ఆ తర్వాతసూర్య ప్రతాప్ డైరెక్షన్లో  ప్రేమకథ తో కూడిన కరెంట్ చిత్రం తో 2009 లో హిట్టు కొట్టాడు.  ఆ తర్వాత సుశాంత్ ఏడాది కి ఓ సినిమా చేస్తూ వస్తున్నాడు కానీ ఇంతవరకు ఒక్క హిట్ కొట్టలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ‘చి. ల.సౌ’ చిత్రం కమర్షియల్ గా పెద్దగా లేకపోయినా సుశాంత్ కు మాత్రం మంచి పేరును తీసుకొచ్చింది.


హీరోగా సరైన సినిమాలు లేని సుశాంత్ తాజాగా సైడ్ రోల్ ప్లే చేయడానికి కూడా రెడీ అయ్యాడు.బన్నీ,  త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న మూడో సినిమా 'అల...వైకుంఠపురములో'లో సుశాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు కాగా ఈ మూవీ లో సుశాంత్ అల్లు అర్జున్ బ్రదర్ గా నటిస్తున్నాడని కొంతమంది అంటున్నారు.మరికొంతమంది హీరోయిన్ పూజా హెగ్డే  అన్న గా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వార్తలను ఖండించాడు సుశాంత్. 

అసలు నా పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయండి కూల్ గా చెప్పాడు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలకి   సీతారామశాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.కాగా నిన్ననే విడుదలైన సిద్ శ్రీరామ్ గాత్రంలోని మ్యాజిక్ కూడ జతకలిసిన సామజవరగమన పాటని ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఆ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌కి చేరింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నేషనల్ వైడ్‌గా కూడా టాప్ 10 లో ప్లేస్ దక్కించుకుంది 'సామజవరగమన'. ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ అల...వైకుంఠపురములో మూవీతో హిట్ అందుకుంటే ఈ రేస్ గుర్రం మళ్ళీ టాప్ లీగ్ రేస్ లోకి దూసుకొచ్చినట్టే.


ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. పూజా హెగ్డే, నవదీప్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, సుశాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: