టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఏ సినిమా తీసినా అందులో ఓ వైవిధ్యం ఉంటుంది.  గత సినిమాలు ఎక్కువగా పోలీస్ నేపథ్యంలో వచ్చి మంచి హిట్ అయ్యాయి.  మహేష్ బాబు తో ‘పోకిరి’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ మూవీ సెన్సేషన్ క్రియెట్ చేసింది. ఇక ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్’ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  మొదటి సారిగా ఎన్టీఆర్ ని ఈ మూవీలో నెగిటీవ్ షేడ్స్ లో చూపించిన ఘనత పూరికే దక్కింది.  అయితే ‘టెంపర్’ మూవీ తర్వాత పూరికి అస్సలు కలిసి రాలేదు.

వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యారు.  మరోవైపు దేవదాసు సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని ‘నేను శైలజ’ హిట్ తర్వాత ఒక్క మూవీ సక్సెస్ కాలేదు.  దాంతో ఈ ఇద్దరు కలిసి మాస్ హిట్ కొట్టానే ఉద్దేశంతో ‘ఇస్మార్ట్ శంకర్’ తెరపైకి తీసుకువచ్చారు. ఈ మూవీకి  నటి చార్మీ నిర్మాతగా వ్యవహరించింది.  అనుకున్నట్లుగా ఈ మూవీ మాస్ హిట్ కొట్టింది.  ఈ మూవీలో పూరి డైలాగ్స్, టేకింగ్..అన్నీ బాగా కలిసి వచ్చాయి.  రామ్ కెరీర్ లో ఓ ఊరమాస్ పాత్రలో నటించడం మంచి విజయం పొందడం జరిగింది.  'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ మంచి జోష్ లో ఉన్నారు.

ఈ నెల 28న తన పుట్టినరోజును జగన్ ఘనంగా చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బంపర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి హీరో రామ్  ఓ గిఫ్ట్ ను ఇచ్చాడు. గోల్డ్ ఫాంటమ్ వైర్ లెస్ స్పీకర్ ను బహూకరించాడు.  తాజాగా ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ వింటూ  జగన్ ఎంజాయ్ చేశారు. జగన్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఛార్మి ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఈ స్పీకర్ ఖరీదు దాదాపు 4 వేల డాలర్స్. ప్రస్తుతం పూరి తన కుమారుడు ఆకాశ్ పూరీతో 'రొమాంటిక్' అనే మూవీ ప్రారంభించాడు.దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: