బాలయ్య ఫిక్స్ అయిపోయాడు. ఆరు నూరైనా.. నూరు నూట యాభై అయినా ఈ మాస్ స్టార్ నిర్ణయంలో ఛేంజ్ లేదు. సెంటిమెంట్ వర్కవుట్ అవుతోందని నందమూరి సీనియర్ స్టార్ భావిస్తున్నాడట. బాక్సాఫీస్ ను రూలింగ్ చేసేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నాడు. 


ఎన్టీఆర్ బయోపిక్ రిజల్ట్ తో బాలకృష్ణకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. కథానాయకుడు, మహా నాయకుడు ఫలితం నుండి తేరుకోవడానికి నందమూరి స్టార్ హీరోకి కాస్త టైం పట్టింది. ప్రస్తుతం బాలయ్య కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 


గత ఏడాది బాలయ్య కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చి జైసింహా కమర్షియల్ గా ఒకే అనిపించుకుంది. ఇప్పుడు ఈ కొత్త సినిమాను కూడా ఫుల్ మాస్ మసాలా హంగులతో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో లేదా జనవరి సెకండ్ వీక్ లో రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ సినిమా టీజర్ ను దసరా కానుకగా రిలీజ్ చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడట. 


విజయదశమి సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేస్తే సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందని బాలయ్య భావిస్తున్నాడట. నిర్మాత సి.కళ్యాణ్ తో పాటు దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ కు టీజర్ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి తేడా రావొద్దని బాలకృష్ణ చెప్పాడట. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని పక్కా పైసా వసూల్ సినిమాగా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక బాలయ్య యాక్టింగ్ గురించి అంతా తెలిసిందే.. ఒకసారి ఈ నటసింహం రంగంలోకి దిగితే ప్రేక్షకుల నుంచి అభినందనలు దక్కాల్సిందే. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: