పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీపై కన్ఫర్మేషన్ ఇచ్చేశాడట. తమిళ మాస్ డైరెక్టర్ తో పాటు బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ పవన్ కు స్టోరీస్ చెప్పినట్టు టాలీవుడ్ టౌన్ సర్కిల్ లో వినిపిస్తోంది. పవన్ సినిమాను ఆ ప్రెస్టిజియస్ బ్యానర్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ రీ ఎంట్రీకి సంబంధించి వినిపిస్తున్న టాక్ ఆయన అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. 


టాలీవుడ్ ఎంపరర్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ ఫుల్ టైం పాలిటిక్స్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే ఈ మధ్య పవన్ మళ్లీ సినిమాలు చేయాలని భావిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంతేకాదు త్వరలోనే పవన్ కొత్త సినిమా పట్టాలెక్కబోతోందట. ఓ తమళ డైరెక్టర్ తో పాటు తెలుగు డైరెక్టర్ తో పవన్ టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 


రీసెంట్ గా దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు సమాచారం. ఈ దర్శకుడు చెప్పిన కథకు పవర్ స్టార్ ఒకే చెప్పారని వినికిడి. త్వరలోనే క్రిష్ తో సినిమాపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ప్రచారం మొదలైంది. అదే విధంగా తమిళ మాస్ దర్శకుడు హరి కూడా పవన్ కళ్యాణ్ ని మీట్ కావడం ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు సరిపోయే టెర్రఫిక్ కథను తమిళ దర్శకుడు వినిపించినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ పవన్, హరి కాంబినేషన్ మూవీని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నాడనేది మరో విశేషం. దీంతో పాటు క్రిష్ తో పవన్ చేయబోయే సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎం రత్నం నిర్మిస్తాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలు నిజమా లేక పుకార్లు మాత్రమే అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: