కొంత మంది అమ్మాయిలకి అందం లేకున్నా అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తుంటాయి. అందుకు స్టార్ హీరోల సపోర్ట్ కావచ్చు..మరేదైనా కావచ్చు. మరి కొంత మందికి మాత్రం అందం ప్రతిభ వున్నా అవకాశాలు ఎంత ప్రయత్నించినా పట్టించుకునే నాధుడే ఉండరు. పరిస్థితులు అనుకూలించవు. ఇలాంటి పరిస్థితినే విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషీ చిల్లర్ ఎదుర్కొంటోంది. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మానుషీ చిల్లర్ ఇండియా నుంచి ఆ ఘనతను సాధించిన ఆరవ మహిళగా రికార్డుల్లో నిలిచిందన్న సంగతి అందరికి తెలిసందే. మిస్ వరల్డ్ గా కిరీటాన్ని సొంతం చేసుకుని రెండేళ్లు దాటినా బాలీవుడ్ లో మాత్రం హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేయలేకపోయింది.

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఫేమస్ అవ్వాలని, స్టార్ హీరో సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని  అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ సక్సెస్ మాత్రం కాలేకపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ పెక్ట్ అమీర్ ఖాన్.. సల్మాన్.. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలని ఇంప్రెస్ చేసి అవకాశాలు దక్కించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ మానుషీ వేసిన ప్లాన్స్  అన్ని ఫ్లాపయ్యాయి. మనూషీ గాలానికి ఏ స్టార్ హీరో చిక్కలేదు. కనీసం యంగ్ హీరోస్ అన్నా ఛాన్స్ ఇస్తారనుకుంటే వాళ్ళు పక్కన పడేశారు. దాంతో బాలీవుడ్ తెరపై కనపడలేకపోయింది. 

మోడల్ గా వుంటూనే బాలీవుడ్ అవకాశాల కోసం స్పైసీ ఫోటో షూట్స్ చేసినా ఎందుకనో ఎవరిని ఆకట్టుకోలేకపోతోంది. ఇంతకుముందు సవ్యసాచి వెడ్డింగ్ ఫోటోషూట్ తో వేడి పెంచినా మానుషికి ఎందుకనో ఏదీ వర్కవుట్ కాలేదు. ఏంటీ నాకీ శాపం..? అంటు తెగ ఇదైపోతోంది. ఎంత ఫోటోషూట్స్ చేసినా ఎవరు ఇంప్రెస్ అవరా.. నేను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల్చుకున్న శాప గ్రస్తురాలినా? అంటు ఆవేదన చెందుతోందట. నా విషయంలోనే ఎందుకిలా జరుగుతుంది? సుశ్మితాసేన్- ప్రియాంక చోప్రా- ఐశ్వర్యారాయ్- డయానా హెడెన్- కంగన .. వీళ్లంతా అందాల పోటీల్లో పాపులరై వెండితెరపై వెలిగిన వాళ్ళే కదా. వాళ్ళతో పోలిస్తే నాకేం తక్కువ అంటు తనలో తానే కుమిలిపోతోందట..? 


మరింత సమాచారం తెలుసుకోండి: