యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన సినిమా ఈ ఏడాదిలో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. కారణం గత సంవత్సరం వరుస ఫ్లాపులు రావడమే. అయితే ఆ గ్యాప్ ను కవర్ చేసేందుకే వరుసగా 4-5 సినిమాలనే లైన్లో పెట్టాడు. ఒక వైపు 'భీష్మ' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కాకుండా కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా.. వెంకీ అట్లూరితో ఇంకో సినిమా కూడా లైన్లో ఉన్నాయి. వీటితో పాటుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమా కూడా క్యూలో ఉందని తెలిసిందే.
 
'భీష్మ' షూటింగ్ పూర్తి కాగానే చంద్రశేఖర్ యేలేటి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తాజా సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని ఆనంద్ ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కొత్త అమ్మాయి సిమ్రాన్ చౌదరిని ఎంపిక చేశారట. అయితే ఈ సినిమాను జూన్ లో లాంచ్ చేసినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియా ప్రకాష్ వారియర్ ను హీరోయిన్లుగా ప్రకటించారు. మరి సిమ్రాన్ చౌదరిని మూడవ హీరోయిన్ గా ఎంపిక చేశారా లేదా.. రకుల్, ప్రియాలలో ఒకరిని రీ ప్లేస్ చేయబోతున్నారా అన్న విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.  

ఇక సిమ్రాన్ చౌదరి విషయానికి వస్తే 'హమ్ తుమ్' అనే సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలోను నటించింది. నితిన్ - యేలేటి సినిమా సిమ్రన్ కు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఒక తెలుగు అమ్మాయికి హీరోయిన్ గా అవకాశం దొరకడం మాత్రం గొప్ప విషయమే.  మరి ఈ సినిమాతోనైనా ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ అయ్యో అవకాశాలున్నాయా అని అందరు చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: