తమన్నా..తళతళ మెరిసిపోతుండే ఈ మిల్కీ బ్యూటీకి సౌత్‌తోపాటు నార్త్‌లోనూ అభిమానులు ఎక్కువే. అందుకే ఈమెకి పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా సినిమాల్లో అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. అటు హీరోయిన్ గా నటిస్తూనే, అప్పుడప్పుడు స్పెషల్ సాంగులలో డ్యాన్స్ చేసే తమన్నా తాజాగా మహేశ్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పక్కా మాస్ బీట్ తో పాటను కంపోజ్ చేస్తున్నార‌ట. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సైరాతో పాటు మొత్తం అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి. 


అలానే క్వీన్ కి రీమేక్‌గా తెరకెక్కిన దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు.తమన్నా కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్‌కి చేరుకున్నప్పుడు బాహుబలి వచ్చి ఆమె కెరీర్‌కి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు సైరా వస్తుంది. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా. అయితే ఆమె కెరీర్ మరింకొంతకాలం ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగాలి అంటే మాత్రం ఒక మంచి కమర్షియల్ హిట్ కూడా అవసరం. ఆ హిట్ తనకు గోపీచంద్- సంపత్ నంది సినిమాతో వస్తుంది అని భావిస్తుందట.


ఇక‌పోతే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. గతంలో చూడని డిఫెరెంట్ లుక్‌లో ఆయన కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న మహేష్ క్యారెక్టర్ పేరు 'అజయ్ కృష్ణ' అని తెలుపుతూ పిక్ రిలీజ్ చేశాడు అనిల్ రావిపూడి.
మిల్కీ బ్యూటీ ఐట‌మ్ సాంగ్   వార్త తెలిసి మహేష్ అభిమానులు ఇప్పుడే పండగ చేసుకుంటున్నారు. తమన్నా అందాల విందులో మహేష్ చిందులు చూడాలని కుతూహల పడుతున్నారు. ఈ లోగా మహేష్‌తో డాన్స్ గురించి కామెంట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది తమన్నా.



మరింత సమాచారం తెలుసుకోండి: