తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వివాదాస్పద దర్శకుడు అంటే వినపడే మొదటి పేరు రామ్ గోపాల్ వర్మ.. ఈయన సినిమాలు అన్ని పూర్తి విభిన్నా కథతో ఎప్పుడు ఎవరినోకరిని ఉద్దేశినట్లుగా ఉంటాయి. ఇకపోతే ఈయన ఇదొక విషయం పై నోరు లేపి వార్తల్లో నిలవడమే కాక, వేరే వాళ్ళ సినిమాను కామెంట్ చేసి వారితో చివాట్లు తినడం వర్మ నైజం.. అలా వర్మ అప్పటి నుండి ఇప్పటివరకు ఏ మాత్రం మారలేదు. 


ఒక సినిమా కనుక హిట్ అయితే నేను ఎలా చెప్పానో అలాగే జరిగింది అంటూ చెప్తూ వస్తాడు. ఇకపోతే వర్మ నోటికి హద్దు పద్దులు ఉండవు అయన ఎం చేసిన కూడా సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని వాళ్ళ పై విరుచుకు పడుతుంటాడు. అలా ఎప్పుడు తిడుతూనో, తిట్టించుకుంటూనో వచ్చే వర్మ చిరంజీవి విషయంలో నేను చెప్పిందే జరిగింది అని వెల్లడించారు. 


విషయానికొస్తే.. చిరంజీవి రాజకీయాలవైపు వెళ్లే ముందు ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు.. అక్కడకు వర్మతో పాటుగా అమితాబచ్చన్, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా హాజరయ్యారు.. ఆ సందర్భంలో నేను సినిమాలకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటాను అని చిరు వ్యాఖ్యానించారు. అప్పటికే చిరు 149 సినిమాలు చేసాడు. ఇకపోతే వర్మ మాట్లాడుతూ.. మీరు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారు . అనగా.. పూరి ఆ 150 వ సినిమా నేనే చేస్తాను అని వెల్లడించారు. 


ఇక బిగ్ బి అమితాబ్ మాత్రం రాజకీయాల్లోకి వెళ్లోద్దని అన్నారు. కాగా, వర్మ చెప్పినట్లు చిరు మళ్ళీ సినిమాల్లోకి రావడం , 150 సినిమాలో నటించడం. ఇప్పుడు 151 వ సినిమా సైరా లో నటించడం జరిగింది. 151 వ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. అయితే, అప్పుడు నేను ఏదైతే అన్నానో అదే ఇప్పుడు చిరంజీవి విషయంలో జరుగుతుందని వర్మ గుర్తుచేసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: