స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల వేట మొదలు పెట్టాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నా పేరు సూర్యతో నిరాశపరచిన బన్ని కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం తో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.


సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ కాస్త వెనక్కి తగ్గడంతో ఈమధ్య తమన్ రెచ్చిపోతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తిరుగులేదన్నట్టుగా చేస్తున్న తమన్ సాంగ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అదే క్రమంలో అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ కు తన ప్రాణం పెట్టినట్టు ఉన్నాడు.


సిరివెన్నెల సాహిత్యం, సిద్ శ్రీరాం గానం.. తమన్ మ్యూజిక్ ఈ మూడు కలిపి సామజవరగమన అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ సాంగ్ రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. అంతేకాదు లైకుల్లో కూడా అత్యధికంగా 2,50,000ల లైకులు సాధించింది. ఇలానే కొనసాగితే సాంగ్స్ రికార్డుల్లో బన్నిని బీట్ చేసే స్టార్ ఉండడని చెప్పొచ్చు.   


ఇక డిజే కాంబో అల్లు అర్జున్, పూజా హెగ్దె కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమధ్య వరుస హిట్లతో పూజా కూడా ఫుల్ ఫాంలో ఉంది. త్రివిక్రం మరోసారి తన పెన్ పవర్ చూపించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. టీజర్ లోనే ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలా వచ్చింది అంటూ తండ్రి కొడుకుల సీన్ చూపించి ఈ సినిమా ఎలా ఉండబోతుందో క్లూ ఇచ్చాడు. మొత్తానికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సంక్రాంతికి క్రేజీ మూవీగా మారుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: