మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు.సైరా సినిమాకి అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి కానీ ఒక్క ఉయ్యాలవాడ వంశీకుల వివాదం మాత్రం చాలా రోజులుగా కలచివేస్తోంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీకులు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలేదని, మోసం చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే..ఈ వివాదం అనేక మలుపులు తిరిగింది.ఉయ్యాలవాడ వంశీకులు  50 కోట్లు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి.  కానీ 50 కోట్లు డిమాండ్ చేయలేదని , ఒక్కొక్కరికి రూ.15 లక్షలు చొప్పున ఇవ్వమని అడిగామని  వారు చేబుతున్నారు.  అయితే మొత్తానికి ఈ వివాదం కూడా ముగియనుంది.  ఉయ్యాలవాడ వంశీకులు ఈ వివాదానికి సంబంధించి తాము వేసిన కేసుల‌న్నీ వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.దీంతో సినిమా విడుదలకు ఎలాంటి అడ్డులేనట్టే. ఈ విషయం పట్ల అభిమానులు మరియు చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు.  

తమిళనాడు మరియు కర్ణాటక లో ఏర్పాటు చేసిన ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ కి మంచి స్పందన వచ్చింది.రీసెంట్ గా విడుదల చేసిన టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతోంది. ఈ పాట ను సిరి వెన్నెల సీత రామశాస్త్రి    రాసారు .  సైరా సినిమా  ను రామ్ చరణ్ దాదాపు 270 కోట్ల తో నిర్మించారు.ఈ సినిమాలో తమన్నా, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ప్రధాన పాత్ర ల్లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి సైరాకు దర్శకత్వం వహించాడు.అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ సినిమా కు రత్నవేలు ఛాయాగ్రాహకుడి గా పనిచేసారు. సినిమా యూనిట్ సినిమా విజయం పైన చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: