టాలీవుడ్ లో మెగా ఫాన్స్ కి దసరా కానుకగా
సైరా వస్తుంది.... మరి నందమూరి ఫాన్స్ కోసం ఏ ట్రీట్ ఇవ్వకపోతే బాగోదు అనుకున్నాడో ఏమోగాని ఓ స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసాడు బాలయ్య. అందుకే ఓ షాకింగ్ డిసీజన్ తీసుకున్నాడట నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆరు పదుల వయసులో కూడా ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు బాలయ్య.ఇటీవల
ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాలకు కేఎస్ రవికుమార్, బోయపాటి శ్రీనులతో ఓకే చేశారు.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో
బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో ఈ సారి దసరాకు బాలకృష్ణ నగారా మోగించాలని ప్లాన్ చేశారట. ఈ మేరకు తన కొత్త సినిమాల తాలూకు విశేషాలతో నందమూరి ఫాన్స్కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని టాక్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తన తాజా సినిమా టైటిల్, ఫస్ట్లుక్, టీజర్ అన్నీ ఒకేసారి
దసరా కానుకగా విడుదల చేయాలనేది బాలయ్య అసలు స్కెచ్ అని తెలుస్తోంది.
అంతేకాదు వీటితో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న సినిమా
ప్రీ లుక్ కూడా రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేస్తున్నారట. ఈ లెక్కన చూస్తే
దసరా ధమాకాగా బాలయ్య ఫుల్ ప్యాకేజీ రెడీ అయినట్టే కదా...! కాబట్టి నందమూరి అభిమానులు ఈ జోష్ తో పీక్ స్టేజ్కి వెళ్లిపోవడం ఖాయమే అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంత వరకు ఉందో తెలియాలంటే
దసరా వరకు ఆగాలి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఇప్పటికే రిలీజ్ చేసిన
బాలకృష్ణ డిఫెరెంట్ లుక్ అందరిని ఆకట్టుకుంది.
యంగ్ లుక్లో బాలయ్యబాబును చూసి యంగ్ హీరోలు సైతం షాకయ్యారు. ఈ చిత్రంలో
బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన `జైసింహా` సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకనిర్మాతలు.