గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో సంచలన విజయాల్ని నమోదు చేసుకుంటున్నాయి. బాహుబలి, బాహుబలి2, సాహో సినిమాలు బాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగు సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ నుండి హిందీ భాషలో డబ్ అయిన సినిమాలు కూడా యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయ్ 
 
తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ లో సంచలన విజయాలు సాధిస్తూ ఉండటం బాలీవుడ్ క్రిటిక్స్ కు నచ్చటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సాహో సినిమా విడుదలైనపుడు బాలీవుడ్ క్రిటిక్స్ సాహో సినిమాకు చాలా దారుణంగా రేటింగ్స్ ఇచ్చారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు సాహో సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సాహో బాలీవుడ్ లో 150 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. 
 
కానీ సాహో సినిమాకు బాలీవుడ్ లో పోటీనిచ్చే సినిమాలేవీ లేవు. కానీ రేపు విడుదల కాబోయే సైరా సినిమాకు మాత్రం వార్ సినిమా గట్టి పోటీ ఇవ్వబోతుంది. హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా కూడా రేపు విడుదల కాబోతుంది. రేపు విడుదల కాబోతున్న సైరా సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ ఎలాంటి రేటింగ్స్ ఇస్తారో చూడాలి. సైరా సినిమా బాలీవుడ్ రైట్స్ ఫర్హాన్ అక్తర్ కొన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో తమిళంలో, మలయాళంలో సైరా సినిమాకు తిరుగులేదని తెలుస్తోంది. బెంగళూరులో మాత్రం సైరాకు వార్ మూవీ గట్టి పోటీని ఇవ్వబోతుంది. వార్ నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు. మరి రేపు విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. రామ్ చరణ్ ఈ సినిమాను 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్, అనుష్క ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: