మెగాస్టార్ సైరా సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుపుకున్న సంగతి తెలిసిందే.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇదిలా ఉంటె, ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ అభిమానులను పండుగ చేసుకునేలా అనిపించింది.  సైరా బిజినెస్ పరంగానే కాకుండా షోల పరంగా కూడా మెప్పించే విధంగా ఉండటం విశేషం.  దేశంలో అన్ని రాష్ట్రాల్లో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు.  ముఖ్యంగా తమిళనాడులో.  


తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా... చెన్నైలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చెన్నై నగరంలో ఉన్న తెలుగు ప్రజల కోసం సైరా మూవీ స్పెషల్ షోలు వేయబోతున్నారు.  ఉదయం 8 గంటలకు స్పెషల్ షోలు వేస్తున్నారు.  ఒక్క చెన్నై నగరంలోనే దాదాపుగా 50 షోలు వేస్తున్నారట.  ఇది రికార్డ్ అని చెప్పాలి.  మెగాస్టార్ కెరీర్లోనే ఇది భారీ రికార్డ్.  అంతేకాదు, ఆగష్టు 30 వ తేదీన రిలీజైన సాహో మూవీ స్పెషల్ షోలు 30 వేశారు.  


చెన్నైలో మెగాస్టార్ అభిమానులు ఎక్కువగా ఉండటంతో 50 స్పెషల్ షోలు వేస్తున్నారట.  ఈ షోలు వేయడం ద్వారా ఫస్ట్ డే రోజున భారీ వసూళ్లు సాధించాలని సైరా చూస్తున్నది.  ఎలాగో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు.  పైగా నయనతార హీరోయిన్ కావడంతో తమిళనాడులో వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉంది.  తమిళనాడులో కలెక్షన్ల పరంగా వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో అని ఎదురు చూస్తున్నారు.  


ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రోజున సినిమా ఏ లెక్కన వసూళ్లు సాధించబోతుంది.. ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయి.. బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  సినిమా బాగుంది అనే టాక్ వస్తే.. సినిమా తప్పనిసరిగా రికార్డులు బ్రేక్ కావడం ఖాయంగా ఉంటుంది.  పర్వాలేదు అని తెలిసినా మంచి వసూళ్లు వస్తాయి.  ఏది ఏమైనా సినిమా రిజల్ట్ మీద ఆధారపడి వసూళ్లు ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: