అప్పటిలో చెన్నైలోని యెతిరాజ్ కాలేజీ లో రజనీకాంత్ భార్య లత చదువుకుంటున్న రోజులలో ఆ కాలేజ్ మేగజైన్ కొరకు రజనీని లత ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలా మొదలైన వారి ఇద్దరి పరిచయం చివరికి పెళ్లివరకు వెళ్ళింది. లత కి ప్రముఖ నటి వైజయంతి మాల బంధువు కాగా ఆమె తమ్ముడు రవి రాఘవేంద్ర కూడా పెద్ద నటుడు. రజని లతా ల వివాహం ఫిబ్రవరి 26న 1981 తిరుపతి దేవస్థానంలో జరిగింది అన్న విషయం అందరికి తెలిసిందే. వీరికి ఐశ్వర్య రజిని కాంత్, సౌందర్య రజిని కాంత్ అనే ఇద్దరు కూతురు ఉన్నారు.
ఇది ఇలా ఉండగా షూటింగ్ సెట్స్ లోని ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చాల విపరీతంగా వైరల్ గా మారింది. ఇక రజిని దర్బార్ సినిమా షూటింగ్ దశలో ఉంది అని తెలుస్తుంది. ఇక కథ విషయానికి వస్తే ముంబై మాఫియా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో రజిని పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. రజిని జతగా హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, అనిరుధ్ సంగీతంలో రాబోతుంది. దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా కి హీరోయిన్ గా నయనతార మంచి రెమ్యూనిరేషన్ కూడా తీసుకుంటుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా రజిని కాంత్ కి మంచి హిట్ ఇవ్వాలి అని కోరుచున్నాము.