తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ‘సైరా’భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కొణెదల ప్రొడక్షన్స్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల రూపాయల భారీబడ్జెట్తో నిర్మించగా. చిరంజీవికి ఉన్న ఈ సత్తాకి,ఈ కోట్లు వెనక్కి తిరిగిరావడం పెద్ద కష్టం కాదంటున్నాయి సినీ వర్గాలు.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్లో చేస్తున్నారు.అంతే కాకుండా టీజర్,ట్రైలర్లు చూస్తే బొమ్మ హిట్టు అనేవారే తప్ప రెండో మాటలేదు.మెగాస్టార్ చిరంజీవి నటించిన‘సైరా నరసింహారెడ్డి’విడుదల కావడమే లేటు కాని..బాక్సాఫీస్ వద్ద స్వైరవిహారం చేయడం ఖాయమే అంటూ లెక్కలు కట్టేస్తున్నారు మూవీ అనలిస్ట్లు.ఇక మెగాస్టార్ చిరంజీవి సత్తా మరో సారి నిరూపణ అవ్వడం ఖాయం ఇంతేకాకుండా సైరా రూ. 500 కోట్ల ఆల్ ఇండియా షేర్ రాబట్టడటం పక్కా అంటూ అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టేసుకున్నారు.
ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక చిత్రం తెలుగుతో పాటు హిందీ,తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్,నయనతార,తమన్నా,కిచ్చా సుదీప్,విజయ్ సేతుపతి,జగపతి బాబు,అనుష్కశెట్టి వంటి స్టార్లు నటించగా.అమితి త్రివేది ఈ చిత్రానికి సంగీతం,రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.
మరీ ఈ సినిమా రిలీజైన తర్వాత సినీ చరిత్రలో ఎన్నడులేనన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అధికంగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త ట్రెండ్ను సృష్టించి,ప్రతిష్టాత్మక మూవీగా చరిత్రలో నిలిచిపోతుందా లేక టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులపనుందా, అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగవలసిందే.. ఏది ఏమైనా ఇప్పుడు ఈ సినిమా టాపిక్ సిని అభిమానుల్లో ఓ టెన్షన్ క్రియేట్ చేసింది.