రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమా విడుదల ఆపాలంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ సినిమా విడుదల ఆపలేమంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్టే.


సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సైరా చిత్రంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. అయితే సైరా నరసింహారెడ్డి మొదట బయోపిక్ అని ఇప్పుడు చరిత్ర తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్ దాఖలైంది. తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.


ఈ సినిమాపై వాదనల సమయంలో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సినిమా ను కేవలం వినోద పరంగా చూడాలని హైకోర్టు కామెంట్ చేసింది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారంటూ హైకోర్టు ప్రశ్నించింది. కల్పిత పాత్రలతో జీవిత చరిత్రలను చూపించడం కొత్తేమీ కాదని హైకోర్టు అభిప్రాయపడినట్టు తెలిసింది.


గతంలో గాంధీజీ, మొగల్ ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. సినిమాకు అంతిమ తీర్పు ప్రేక్షకులదేనన్న హైకోర్టు.. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని కామెంట్ చేసింది. ఈ సమయంలో తాము సినిమా ను అపలేమని తెలిపింది. సైరా నర్సింహారెడ్డి సినిమా విడుదల ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.


సైరా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో సంతోషం వెల్లివిరుస్తోంది. దీంతో ఉన్న ఒక్క అడ్డంకి కూడా తొలగిపోవడంతో మెగా క్యాంప్ లో టెన్షన్ పోయింది. ఇక సినిమా విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: