తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 కి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ 3 కి హూస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జు ఇంటి సభ్యులు ముసుగు తీసివేయాలని చెప్పారు. అయితే ఇంటి సభ్యులు ఇంకా ముసుగు తీయలేదని శనివారం అందరికీ సిరియస్ గా క్లాస్ పీకిన విషయం తెలిసిందే. మొన్నటి వారం రాహుల్, వరుణ్,బాబా
భాస్కర్ లకు బాగానే క్లాస్ పీకారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్బాస్ ఇచ్చిన‘రాళ్లే రత్నాలు’టాస్క్ కాస్త ఫన్నీ, సిరియస్ గా నడిచింది.
మహేష్ తన వద్ద రాహూల్ రాయి తీసుకున్నాడని చాలా సిరియస్ అయ్యాడు..నేను అందరి వద్దకు వచ్చి లాక్కుంటే మీరేమీ అనరా అంటూ..అసలు నేను ఈ
గేమ్ ఆడను..నా వద్ద ఉన్నవి మీరు ఉంచుకోండి అంటూ కొంతమందికి ఇచ్చాడు. ఇంటి సభ్యులు అదంతా ఆటలో భాగమే అని మిగతావారు నచ్చజెప్పడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకులే అని భావించిన మహేశ్ తిరిగి ఆట ప్రారంభించాడు. తాను కోపంగా పునర్నవికి ఇచ్చిన 200 రాయి కోసం తెగ బతిలాడినా ఆమె మాత్రం ససేమిరా అంది. నువు నాకు వాలంట్రీగా ఇచ్చావు..నేను ఇవ్వను అంటూ భీష్మించింది. వీరి మద్య జరిగిన సంభాషన చూస్తున్నవారంతా నవ్వుకున్నారు.
వెంటనే తేరుకున్న మహేశ్ మళ్లీ ఆటలో కాస్త పుంజుకున్నాడు. ఇక బిగ్బాస్ ఇంటిసభ్యులకు నామినేషన్ టాస్క్ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్లో మహేశ్, రాహుల్కు గొడవ జరగగా నేడు వరుణ్, వితికల మద్య గొడవ జరిగింది. రాళ్లు సేకరించే క్రమంలో బాబా, వితిక ఒకరినొకరు తోసుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ తోపులాటలో వితిక కిందపడింది...దాంతో బాబా పై సీరియస్ అయ్యింది రితిక. దాంతో అక్కడే ఉన్న
వరుణ్ సందేశ్ వచ్చి ఇది టాస్క్.. అలానే జరుగుతుంది, టాస్క్లో దెబ్బలు తగులుతాయి’ అంటూ వరుణ్.. వితికపై ఫైర్ అయ్యాడు. మొత్తానికి భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాటే జరిగింది. మిగిలిన ఎపిసోడ్ ఈ రోజు చూపించబోతున్నారు..మరి ఇంట్లో వీరిద్దరి మద్య ఏం జరగబోతుందో చూడాలి.