కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించిన ‘భారతీయుడు’ ఒక సెన్సేషన్ సృష్టించింది.  ఈ మూవీలో లంచం తీసుకున్న ప్రతి ఒక్కరూ నేరస్తులే..అలాగే లంచం ఇచ్చేవారు నేరస్తులే అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కింది.  ఈ మూవీలో కమల్ హాసన్ సేనాపతి అని స్వతంత్ర సమరయోధుడిగా వృద్దుడి పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించాడు. మరోపాత్ర ఆర్ టీవో అధికారి గా నటించాడు. తన కొడుకు లంచం తీసుకున్నాడని ఏకంతా కొడుకునే చంపేస్తాడు..అక్కడ నుంచి విదేశాలకు వెళ్తాడు..ఇది భారతీయుడు ఎండింగ్.

‘భారతీయుడు’ 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో  ఈ మూవీ రిలీజ్ అయ్యింది.   ఈ మూవీ సీక్వెల్ అప్పుడు ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది.  కానీ అది మాత్రం సెట్స్ పైకి రాలేదు.  కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు.  23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ మూవీకిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీ పై మొదటి నుంచి రక రకాల అవరోధాలు ఎదర్కొంటు వస్తుంది. 

మొత్తానికి అంతా సెట్ అయి ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం.   ఈ మూవీతో అజయ్ దేవగన్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శంకర్, అనిల్ కపూర్ మధ్య చర్చలు కూడా జరిగాయని, ఆయన సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.  ఈ విషయంపై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: