ఆగడు సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఇద్దరు మిల్కీ స్టార్స్ ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. గతంలో 'ఆగడు' సినిమాలో మహేష్ బాబుకు జంటగా నటించింది తమన్నా. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు' లో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమైంది ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. ఇంకేముంది తమన్నా అందాల విందులో మహేష్ చిందులు చూస్తుంటే మిల్క్ షేక్ లా ఉంటుందని  పండగ చేసుకుంటున్నారు మహేష్ అభిమానులు. ఈ లోగా మహేష్‌తో డాన్స్ గురించి కామెంట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది తమన్నా.

మహేష్ బాబుతో తాను చేయబోయే ఈ సాంగ్ ఓ రేంజ్‌‌లో ఉంటుందని సాంగ్ వస్తుంటేనే థియేటర్లన్నీ హోరెత్తిపోతాయని అంటోంది. ఎందుకంటె   సరిలేరు నీకెవ్వరు'లో ఇంట్రడక్షన్ సాంగ్లో మహేష్‌తో తాను ఓ రేంజ్ చిందులేస్తానని చెప్పింది తమన్నా.  దీంతో మూవీ స్టార్టింగ్ లోనే మహేష్ అభిమానులంతా ఈలలు, గోలలతో నానా హంగామా చేస్తారని చెప్పింది. 

ఈ సందర్బంగా ఓ మీడియాతో మాట్లాడిన తమన్నా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబుతో స్టెప్పులేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఈ సాంగ్ చిత్రీకరణ కూడా ప్రారంభం కాక ముందే తమన్నా ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది అంటే ఇక సాంగ్ కంప్లీట్ ఐతే ఈ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు. మరోవైపు ఈ ఐటెం సాంగ్ యమ ఫాస్ట్ బీట్‌తో క్లాస్, మాస్ ఆడియన్స్‌ చేత కేకలు పెట్టించేలా ఉండాలని డిసెంబర్ లో సాంగ్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

పైగా ఈ సాంగ్‌లో మహేష్ బాబుతో తమన్నాను చిందులేపించాలని, తమన్నా సొగసు పాటకు స్పెషల్ డోస్ ఇచ్చేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం తమన్నాకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: