ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ గేర్లో కొనసాగుతున్న హీరోయిన్ పూజా హెగ్డే. వరుసపెట్టి ఒకరి తరువాత మార్క స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది ఈ అందాల భామ. దీనితో పూజా హెగ్డే ఒక్కసారిగా స్టార్ స్టేటస్ పట్టేసింది. నిన్నటికి నిన్న వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్ సినిమాలో తక్కువ సమయమే నటించినా  తన నటనతో తెలుగు ప్రజలను అమాంతం దగ్గర అయింది. ఈ సినిమాలో ముఖ్యంగా రీమేక్ చేసిన "యల్లు వచ్చే గోదారమ్మ" పాటతో అందాల తార  హీరోయిన్ శ్రీదేవిని మయమరిపించింది. 
ఇక అసలు విషయానికి వస్తే  పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో, అలాగే ప్రభాస్ సరసన మరో సినిమాలో నటిస్తోంది.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం ఏమిటంటే మహేష్ బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా పూజా కనిపించనుందని తెలుస్తోంది. వీరిద్దరూ గతంలో మహేష్ బాబు 25వ సినిమా మహర్షిలో జోడీ కట్టి ప్రేక్షకులని ఆకట్టుకొంది. ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ చూసి మహేష్ అభిమానులు మురిసిపోయారు.
అయితే ఈ విషయాన్ని గమనించిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పూజా హెగ్డేతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

అయితే ఇంతవరకు ఈ సినిమాకు కాను ప్రత్యేక గీతం కోసం తమన్నాను మరో పాట కోసం పూజా హెగ్డేని తీసుకోబోతున్నారన్న విషయం తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, రష్మిక మందానతో పటు ఇప్పుడు పూజా హెగ్డే కూడా తోడు అవ్వడంతో ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్‌గా నటించబోతున్న విషయం అందరికి విధితమే.

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కలర్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2020 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: