అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి నటిస్తుండగా.. హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. అనీల్ సుంకర, దిల్ రాజులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా క్రేజ్ ను పెంచేందుకు మరో హీరోయిన్ ను కూడా నటింపజేయాలని దర్శకుడు అనీల్ రావిపూడి కొత్త ప్లాన్ వేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్.

రీసెంట్‌గా 'గద్దలకొండ గణేష్' సినిమాలో శ్రీదేవి అనే చిన్న పాత్ర లో పూజా హెగ్డే కనిపించిన విషయం తెల్సిందే. చిన్న పాత్ర అయినా కూడా ఆ పాత్రతో సినిమా స్థాయిని పూజా అమాంతం పెంచేసింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన పూజా హెగ్డే ను ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం అనీల్ రావిపూడి సంప్రదించాడని.. అందుకు పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటు తాజా సమాచారం. తెలుగులో పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ కు జోడీగా 'అల వైకుంఠపురంలో' అలాగే ప్రభాస్ కు జోడీగా 'జాన్' సినిమాలలో నటిస్తోంది.

ఇక బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి. టాలీవుడ్ లో ఎటు ఢోకా లేదు కాబట్టి బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా బిజీ అవడానికి బాగా ట్రై చేస్తోంది. ఇంత బిజీగా ఉన్నా కూడా మహేష్ బాబు సినిమా కావడంతో చిన్న పాత్ర అయినా  పూజా హెగ్డే నటించేందుకు ఒప్పుకుందట. గద్దలకొండ గణేష్ సినిమాలో శ్రీదేవి పాత్రలో నటించేందుకు గాను పూజా కి భారీ మొత్తంలో పారితోషికంను ఇచ్చారు. అంతకు మించి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాకు నిర్మాతలు ఇస్తామని ఆఫర్ చేశారట. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు సినిమాలో పూజా హెగ్డే కూడా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగనున్నాయి. అంతేకాదు టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా సెంటిమెంట్ హీరోయిన్ గా అయిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: