2.ఓ వంటి హాలీవుడ్ స్థాయి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో 'ఇండియన్ 2' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో జరుపుతున్నారు. కమల్ హాసన్ రెండు విభిన్నమైన గెటప్స్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కమల్ కి ధీటుగా కథ కు కరెక్ట్ గా సూటయ్యోలా ఒక పవర్ ఫుల్ విలన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది.

అయితే ఇటీవల దర్శకుడు శంకర్ తో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనీల్ కపూర్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. వీరిద్దరి కలిసింది 'ఇండియన్ 2' సినిమా కోసమే అంటు అటు బాలీవుడ్ లోను ఇటు కోలీవుడ్ లోను  జోరుగా చర్చ జరుగుతోంది. ఇండియన్ 2 సినిమా కోసమే వీరిద్దరు కలిసి ఉంటారని సోషల్ మీడియాలో కూడా బాగా టాక్ నడుస్తోంది. ఈ సినిమాని బాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు.. అక్కడ మంచి బిజినెస్ చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ను నటింపజేయాలని మొదటి నుండి శంకర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాలో విలన్ పాత్రకు అనీల్ కపూర్ ను ఎంపిక చేసుకున్నట్లుగా గాసిప్స్ బాగా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే శంకర్ ఇంతకముందు తెరకెక్కించిన 2.ఓ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ వల్లనే భారీ బిజినెస్ అవడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అందుకే ఇప్పుడు అనీల్ కపూర్ ను కూడా అదే ఉద్దేశ్యంతో దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2' సినిమాలో తీసుకుంటున్నాడని అనిపిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దాదాపు 23 ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారన్న అన్న విషయం తెల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: