మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుడి పాత్రలో నటించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారా మంచి హిట్ టాక్ రావడంతో దర్శకుడు సురేందర్, హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

దీనితో సురేందర్ రెడ్డి టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా మారిపోతారని టాక్ వినపడుతోంది. అయితే సురేందర్ మాత్రం అందుకు భిన్నంగా ఒక యంగ్ హీరోతో తన తదుపరి సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నితిన్ అంటూ నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దానితో పాటు రంగ్ దే అనే సినిమా షూటింగ్ లో కూడా త్వరలో పాల్గొనబోతున్నారు కూడా. 

అయితే వాటి రెండిటి తరువాత వెనువెంటనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తాడని అంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ సినిమాకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కథా చర్చలు కూడా జరిగాయని, అంతేకాక సురేందర్ చెప్పిన స్టోరీ నితిన్ కు ఎంతో బాగా నచ్చడంతో అతడు కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై మరి కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.... !!


మరింత సమాచారం తెలుసుకోండి: