మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి తరం రాయలసీమ ప్రాంతనికి చెందిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ దిగ్గజ నటుడు జగపతి బాబు, కన్నడ నటుడు సుదీప్, భోజ్ పురి నటుడు రవి కిషన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కీలకమైన అతిథి పాత్రలో అనుష్క శెట్టి నటిస్తోంది. 

ఇకపోతే రేపు రిలీజ్ కాబోయే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ గురించి ఇప్పటివరకు బయటకు రాని న్యూస్ ఒకటి వెలువడింది. దాని ప్రకారం, సినిమాలో మంచి గూస్ బంప్స్ కి కారణమయ్యే సీన్స్ ఇవే నంటూ నేడు ఒక వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, సినిమాలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సినిమా ప్రారంభంలోనూ, అలానే ముగింపు సమయంలోను వస్తుందట. అయితే సినిమా క్లైమాక్స్ సమయంలో పవన్ వాయిస్ తో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయని అంటున్నారు. ఇకపోతే అనుష్క ఈ సినిమాలోని ఫస్ట్ సీన్ లో కొద్దీ క్షణాలు కనపడుతుందట. ఆమె ఉన్న ఆ కొన్ని క్షణాలు ఝాన్సీ లక్ష్మి బాయిగా ఆమె క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. 

ఇక ప్రీ ఇంటర్వెల్ సమయంలో వచ్చే అండర్ వాటర్ ఫైట్ ఇప్పటివరకు మరే టాలీవుడ్ సినిమాలోనూ రాలేదని, తప్పకుండా ఆ ఫైట్ థియేటర్ లో అదిరిపోతుందని అంటున్నారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా సినిమా ప్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చే యుద్ధ సన్నివేశం అయితే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లా ఉంటుందని, ఆ సీన్ చూస్తున్నంతసేపు కూడా ప్రేక్షకులు తల తిప్పకుండా ఆ సీన్ నే చూస్తూ ఉంటారని అంటున్నారు. ఇటువంటి మరొక రెండు సీన్స్ సినిమాలో ఉన్నాయని, అయితే అవి రేపు సినిమా చూసిన తరువాతనే తెలుస్తుందని అంటున్నారు. మరి ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం, రేపటివరకు వేచి చూడాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: