సురేందర్ రెడ్డి సినిమాలని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తాడన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' కోసం దాదాపు రెండేళ్ళుగా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేశాడు. ఈ సినిమా కోసం రాజమౌళి లాగా ఎంతో శ్రమించి హాలీవుడ్ మూవీ స్టాండర్డ్స్ తో సినిమాని తెరకెక్కించాడని ఇప్పటికే ఇండస్ట్రీ మొత్తం ఎంతో గొప్పగా చెప్పుకుంటోంది. ఇక ఈ రోజు  విడుదలైన ఈ సినిమా దర్శకుడిగా సురేందర్ రెడ్డికి మంచి మార్కులే పడేలా చేసింది. ముఖ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డి సత్తాకు ఈ సినిమా ఒక టెస్టే అని చెప్పాలి. అయితే ఆ టెస్ట్ లో సురేందర్ 100% మార్కులు సంపాదించుకున్నాడు. ఎందుకంటే సురేందర్ కెరీర్ లో ఇలాంటి భారీ బడ్జెట్.. హిస్టారికల్ ఫిలిం తెరకెక్కించడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా ఫలితంతో అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే  సురేందర్ రెడ్డి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సురేందర్ రెడ్డి వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. అయితే సూరి నెక్స్ట్ ఫిలిం మాత్రం స్టార్ హీరోతో ఉండదని ఫిలిం నగర్ టాక్. సూరి తన నెక్స్ట్ ఫిలిం యంగ్ హీరో నితిన్ తో చేస్తాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.  ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించేందుకు రెడీగా ఉన్నారని లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

అయితే ప్రస్తుతం నితిన్ డైరీలో అసలు ఖాళీ లేదు. వరుస సినిమాలతో స్టార్ హీరో రేంజ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. మరి సురేందర్ రెడ్డి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాటి పరిస్థితి ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే అన్నీ కుదిరితే నితిన్ - సురేందర్ సినిమా పట్టాలెక్కడం పెద్ద సమస్యేమీ కాదని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ కమిటయిన ప్రాజెక్ట్స్ లో ఏదన్న కాస్త డిలే అయితే ఆ డేట్స్ ఈ ప్రాజెక్ట్ కి సర్దుబాటు చేయాలాని నితిన్ కూడా అనుకుంటున్నాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: