13 సంవత్సరాల గ్యాప్ తరువాత విజయశాంతి నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కోసం ఆమెకు అత్యంత భారీ పారితోషికం ఇచ్చారు. అయితే ఈ మూవీని ఒప్పుకునే ముందు ఆమె పెట్టిన కొన్ని కండిషన్స్ ఇప్పుడు ఈ మూవీ మేకర్స్ కు పెను సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు విజయశాంతి ఈ మూవీలో నటించే ముందు తాను హైదరాబాద్ లో తప్పించి ఈ మూవీ షూటింగ్ కోసం ఎక్కడకు రాను అని కండిషన్స్ పెట్టినట్లు టాక్. అయితే ఇప్పుడు ఆ కండిషన్స్ వల్ల ఈ మూవీ బడ్జెట్ బాగా పెరిగి పోయింది అని తెలుస్తోంది. 

ఈ సినిమాకు ఉన్న కథ రీత్యా విజయశాంతి ఇల్లు రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది. సహజత్వం కోసం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను రాయలసీమ ప్రాంతంలోని ఒక ఇంటిలో తీయాలని భావించారు. అయితే విజయశాంతి రాయలసీమ ప్రాంతానికి వచ్చి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి ఇష్టపడక పోవడంతో చేసేదేమీ లేక హైదరాబాద్ నగర శివార్లలో 30 ఎకరాల ఫార్మ్ హౌస్ ను లీజ్ కు తీసుకుని ఒక బంగ్లా సెట్ వేశారట. 

దానిని ఆనుకుని ఒక జొన్నతోట కృత్రిమంగానే సృష్టించారట. వీటి అన్నిటికీ చిత్రబృందం భారీగానే ఖర్చు పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెట్ లోనే సినిమా షూటింగ్ జరుగుతోంది. పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్న పరిస్థితులలో విజయశాంతి వల్ల ఈ మూవీ బడ్జెట్ పెరిగి పోయింది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా కోసం విజయశాంతి తన లుక్ లో చాల కష్టపడి మార్పులు చేసుకుంది. దీనికి తగ్గట్టుగానే ఆమెకు 4 కోట్ల భారీ పారితోషికం అందుకుంది అన్న వార్తలు కూడ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: