హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమైపోతున్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ క్రేజ్ పెంచడం కోసం ఈ మూవీలో హీరోయిన్ గా నటించే విషయంలో పూజ హెగ్డేకు భారీ పారితోషికం ఇచ్చారు. 

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రత్యేకమైన కోర్టు సెట్ వేసి ఈ మూవీలో వచ్చే కోర్టు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.కుటుంబ అను బంధాల నేపధ్యంగా ఉండే ఈ సినిమాలో ఈ కోర్టు సీన్స్ కు సంబంధించిన సీన్స్ అత్యంత కీలకం కాబోతున్నాయి. అయితే ప్రేమించి పెళ్ళి చేసుకున్న అఖిల్ పూజ హెగ్డేలు విడిపోయే సన్నివేశాలకు సంబంధించి కొన్ని సీన్స్ ను ఇప్పుడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చిత్రీకరిస్తున్నాడు. 

ఈ మూవీలో పూజ హెగ్డేను ఒప్పించే విషయంలో ఆమె బిజీ రీత్యా ఆమె ఇచ్చిన డేట్స్ కు అఖిల్ డేట్స్ ను సద్దుబాటు చేస్తూ ఈ మూవీలో పూజ హెగ్డే పాత్రను హైలెట్ చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమాను నిర్మిస్తున్నది అల్లు కాంపౌండ్ అయినప్పటికీ ఈ మూవీ నిర్మాణ విషయంలో పరోక్షంగా అన్ని వ్యవహారాలను నాగార్జున దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు టాక్. 

ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ మరో ఫెయిల్యూర్ హీరోతో కలిసి తీస్తున్న సినిమా కావడంతో ఈ మూవీకి పెద్దగా అంచనాలు క్రియేట్ చేయకుండా తక్కువగా ప్రమోట్ చేస్తూ ఈ మూవీ ప్రమోషన్ ను కొనసాగించాలని నాగార్జున ఈ మూవీ నిర్మాతలకు సలహాలు ఇచ్చినట్లు టాక్. ఈ మూవీకి సంగీత దర్శకత్వం వహిస్తున్న గోపీసుందర్ ఈమూవీకి హైలెట్ గా మారి యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఈ మూవీని ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో ముందుగా విడుదల చేయాలని భావిస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: