ఆ మద్య తెలుగు లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకు వచ్చింది.  ఆమె చేస్తున్న పోరాటానికి అనూహ్యంగా మద్దలు లభించింది..కానీ ఆమె నోటి దురసు వల్ల ఆ మద్దతు ఒక్కసారే వెనక్కి పోయింది.  ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటే పలువురు సెలబ్రెటీను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా, కంగనా రౌనత్ మీ టూ ఉద్యమాన్ని  లేవనెత్తారు.  ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా గతంలో తనపై ప్రముఖ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. 

ఇలా మీ టూ ఉద్యమం నేపథ్యంలో ఎన్నో కేసులు బయటకు వచ్చాయి. ఎంతో మంది నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు ఇతర విభాగాల్లో ఉన్నవారు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి గలమెత్తారు. తాజాగా బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది.  తెరపై హాట్ హాట్ గా కనిపించే ఎల్లీ అవ్రామ్  'కిస్ కిస్కో ప్యార్ కరూ' సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.  తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాల గురించి చెప్పింది. తనకు సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పి ఇద్దరు దర్శకులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో మాట్లాడతామని చెప్పి..షేక్ హ్యాండ్ ఇచ్చి చేతిని గోకడం..కామంతో చూడటం లాంటి అసహ్యమైన పనులు చేశారని చెప్పింది.

అప్పుడు తనకు ఏమీ అర్థం కాలేదని..వారు అలా ఎందుకు ప్రవర్తించారో.. దానికి అర్ధం ఏంటో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.  ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి చెబితే ఆమె షాకై దానికి అర్ధం చెప్పిందనీ.. దాంతో తాను షాక్ కి గురయ్యానని వివరించింది.  కొంత మంది దర్శకులు అడిగిన దానికి ఒప్పుకోకపోవడంతో..తనను పొట్టిగా ఉన్నావని, మరొకరు నుదురు బాలేదని, ఇంకొకరు పళ్లు బాలేవని.. కొందరేమో తన పొడుగు జుట్టు చూసి ఆంటీ అని పిలిచేవారని చెప్పి కన్నీరు పెట్టుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: