తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లు నటించడమే అరుదు. వారికి తమిళ సినిమాలపై ఉన్న క్రేజ్ తెలుగు సినిమాలపై ఉండదు. ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, లారా దత్తా, ప్రియాంక చోప్రా.. ఇలా వీళ్లంతా తమిళ సినిమాలు చేసిన వారే. తెలుగు సినిమాలు వీళ్లకు కనబడవు. ఇప్పుడిప్పుడే కొంత పరిస్థితి మారుతోంది. తెలుగు సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతూండడంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు ఓకే చెప్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఇలా ఆలోచించే ఓ తెలుగు సినిమా చేసింది. బాహుబలితో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ చూసి ఆమె సాహోలో నటించింది.


ఈ సినిమా విడుదలై అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. హిందీలో మాత్రమే చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చాయి. అయితే అమ్మడు ఇటివల సాహో పేరెత్తటానికి ఇష్టపడటం లేదు. సినిమా విడుదలకు ముందు ప్రభాస్ తో నటించడం ఆనందంగా ఉంది. మంచి కథాబలం ఉన్న సినిమా.. అంటూ ఊదరగొట్టేసింది. అయితే ఇటివల ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన మైండ్ రాక్స్ యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొంది. ఈ కార్యక్రమంలో యాంకర్ సాహో గురించి చెప్పండి.. అనగానే ఎదురుగా ఉన్న యువతను చూసి వాళ్లు నాతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు అని సంబంధంలేని సమాధానం ఇచ్చింది. తర్వాత మరోసారి యాంకర్ ఇదే ప్రశ్న వేయగా ఐ లవ్యూ అంటూ వారికి చెప్పింది. మళ్లీ ఇదే ప్రశ్న వేయగా మీరు చిచ్చోరే సినిమా చూశారా అంటూ ప్రశ్నించింది. సాహో గురించి మాత్రం మాట్లాడలేదు. 


సాహో గురించి మాట్లాడటానికి ఈమెకు ఏమైంది. తెలుగంటే అంత చిన్నచూపా.. అనే అనుమానాలు వస్తున్నాయి. లేదా.. సినిమా ఫెయిల్యూర్ అయింది కాబట్టి మాట్లాడటం లేదా.. తెలుగు సినిమా గురించి మాట్లాడటం లేదా అని శ్రద్ధా తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: