ప్రభాస్ నటించిన "సాహో" ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ లో సూపర్ హిట్ దిశగా ప్రయాణించి హిందీ వెర్షన్ లో 153 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల కలెక్షన్లు సాధించి ఓ మోస్తారు విజయం సాధించింది. సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అయిపోతుంది. ప్రభాస్ ఈ సినిమా ఫలితంపై స్పందించాడు. సాహో గురించి బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్  ని అడగగా ఆమె నుండి మాట కూడా రాకపోవడం గమనార్హం.


సాహో విడుదలకు ముందు ఆ చిత్రం గురించి హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎంత గొప్పగా చెప్పిందో తెలిసిందే. ప్రభాస్తో కలిసి పని చేయడం గురించి.. ఇంత పెద్ద సినిమాలో భాగం కావడం గురించి చాలా ఎగ్జైట్ అయింది. ప్రమోషన్లలో చాలా హుషారుగా పాల్గొంది. ఎక్కడా చూసినా ప్రభాస్, శ్రద్ధానే ఎక్కువగా కనిపించారు. అలాంటిది సినిమా రిలీజ్ అయ్యాక మీడియాకి అస్సలు కనిపించకుండా పోయింది. తాజాగా ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సాహో గురించి హోస్ట్ ప్రశ్నలు అడిగితే ఆమె స్పందించిన తీరు విస్మయం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సాహో సినిమాలో నటించారు కదా..ఆ అనుభవాలు చెప్పండి అని హోస్ట్ అడిగినపుడు, ఆమె ఆ క్వశ్చన్ ని పట్టించుకోకుండా ఆడియన్స్ వైపు తిరిగి వాళ్ళని పలకరించి, వాళ్లు నాతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు అంటూ సంబంధం లేకుండా మాట్లాడింది. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన హోస్ట్ సాహో గురించి చెప్పండి అని మళ్లీ అడిగాడు. మళ్లీ ఆమె ప్రేక్షకుల వైపు చూసింది. వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. ఎవరో ఐలవ్యూ అంటే లవ్యూ టూ అని బదులిచ్చింది. హోస్ట్ మళ్లీ గ్యాప్ ఇచ్చాడు. సాహో గురించి చెప్పమన్నాడు.


అపుడు ఆమె సాహో? అంటూ అక్కడితోనే ఆపేసి, చిచ్చోరే సినిమా చూశారా  అని ఆడియన్స్ ని అడిగింది. దీంతో ఆమెకి సాహో సినిమా గురించి మాట్లాడటం ఇష్టం లేదని తెలిసిపోయింది. చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. అప్పుడేమో సాహో అలా, ఇలా అని గొప్పలు చెప్పి, ఇప్పుడు అసలేమీ మాట్లాడకపోవడం విచారకరం. హిట్ సినిమాల గురించే మాట్లాడతాను అనడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు ఆమెపై మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: