ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాల ప్రజలకు తెలుగు సినిమా అంటే ప్రత్యేక అభిమానం.బాహుబలి నుండి రీసెంట్ గా విడుదలైన సాహో వరకు భీమవరంలో భారీ కటౌట్లు కిలోమీటర్ల మేర పోస్టర్ లతో తమ అభిమానం చాటుకున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇటూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొదలు.. ఏపీలోని అమలాపురం వరకూ ఎక్కడ చూసినా థియేటర్స్ అన్నీ 'సైరా.. సైరా అంటున్నాయి.
కొన్ని చోట్ల సైరా పోస్టర్స్ కి పాలాభిషేకాలు, పుషాభిషేకాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా భీమవరం మెగా ఫ్యామిలీ అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఉపాసన ... తన మామయ్య ‘సైరా’ సినిమా విడుదల సందర్బంగా కూడా కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ‘సైరా’ సినిమా విడుదలను చిరు అభిమానులు ఓ పండగలా చేసుకుంటున్నారు. అక్టోబర్ 2 సైరా సినిమా విడుదల సందర్భంగా భీమవరంలో సైరా కోసం పెద్ద పోస్టర్ ఏర్పాటు చేశారు. ఏకంగా250 అడుగుల పొడవైన భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. దాదాపు అరకిలోమీటర్ వరకు చిరంజీవి అభిమానులు సైరా కోసం బ్యానర్ కట్టారు. అయితే ఈ బ్యానర్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్లో ట్వీట్ చేస్తూ... భీమవరం అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఉపాసన కొణిదెల.
ఇక ఇప్పుడు అదే భీమవరంలో మెగా అభిమానులు కూడా అచ్చం ఇలాంటి పోస్టర్ ఒకటి పెట్టి తెలుగు సినిమాల పట్ల వారికున్న నా ఇష్టం తెలియజేశారు. ప్రభాస్ సొంతూళ్లేనే ఈ బ్యానర్ కట్టి అక్కడ మెగా ఫ్యాన్స్కు కూడా తిరుగులేదని చెప్పకనే చెప్పారు రు. ఒకప్పుడు పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య కూడా భీమవరంలో గొడవలు కూడా చోటు చేసుకోవడం తెలిసిందే.