‘సైరా’ సూపర్ హిట్ తెచ్చుకోవడంతో మంచి జోష్ లోకి వెళ్ళిపోయిన మెగా అభిమానుల ఆనందాన్ని ఒక ట్విట్ కలవపాటుకు గురిచేస్తోంది. సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్  ఇప్పుడు  వైరల్ గా మారడమే కాకుండా ఆ ట్విట్ ను చూసి మెగా అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. ఈ మధ్యనే రాజకీయాలను విడిచి పెట్టి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న ఈ బ్లాక్ బస్టర్ నిర్మాత తిరిగి కమెడియన్ గా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో ఒక వైపు నటుడిగా కొనసాగుతూనే తిరిగి నిర్మాతగా మారి టాప్ హీరోలతో భారీ సినిమాలను తీయడానికి ప్రాయత్నిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ భారీ నిర్మాత ఒక ప్రముఖ దర్శకుడిని మహేష్ దగ్గరకు తీసుకు వెళ్ళి అతడి డేట్స్ అడిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్రయత్నాలు అలా కొనసాగిస్తూనే ఈ విలక్షణ నిర్మాత సూటిగా రామ్ చరణ్‌‌‌ కి స్కెచ్  వేయడం హాట్ టాపిక్ గా మారింది.   
సైరా’ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ''మళ్ళీ మీతో ఒక సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్'' అంటూ తన అభ్యర్ధనను తన ట్విట్ ద్వారా తెలియచేసాడు. గతంలో రామ్ చరణ్‌తో కలిసి బండ్ల గణేష్ 'గోవిందుడు అందరివాడేలే'  సినిమా తీసిన విషయం తెలిసిందే. 

ఈ మూవీ 2014లో అక్టోబరు 1న విడుదలైంది ఆ సినిమా విడుదలై  ఐదేళ్లు పూర్తయిన సందర్బంగా చరణ్ కు ఆ జ్ఞాపకాలను గుర్తుకు చేస్తూ ‘సైరా’ కూడ బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరుతుందని చెపుతూ ఈ ట్విట్ చేసాడు. అయితే ఈ ట్విట్ చూసి మెగా అభిమానులు భయపడి పోతు రామ్ చరణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని కలవర పడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: