తెలుగు సినీ పరిశ్రుమలో జూనియర్ ఎన్టీఆర్ అందరితో సరదాగా ఉంటాడు. సెట్లో కూడా సరదాగా ఉంటాడని పేరు ఉంది. చలాకీతనంతో ఉండే జూనియర్ ఎన్టీఆర్ నిత్యం వార్తల్లో నిలుస్తూంటాడు. తెలుగు పరిశ్రమలోనే కాకుండా ఆయనకు దక్షిణాది భాషల్లో కూడా సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు ఎక్కువే. అదే స్నేహంతో ఎన్టీఆర్ ఇద్దరు సినీ స్టార్స్ కు తన ఇంట్లో విందు ఇచ్చాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కన్నడ ఫిలిం స్టార్ యాష్ కు ఈ సోమవారం రాత్రి తన ఇంట్లో అద్భుత విందు ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. యాష్ ఇందులో హీరో. షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన వీరిని ఎన్టీఆర్ కలుసుకున్నారు. స్నేహపూరిత వాతావరణంలో వారిద్దరినీ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడట. జూనియర్ కోరిక మన్నించిన వీరిరువురూ సోమవారం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారట. సౌత్ ఇండియన్ డిషెస్ తో సంజయ్ దత్ కు అద్భుత రుచులు సిద్దం చేశాడట. జూనియర్ అతిధి మర్యాదకు ముగ్దుడైన సంజయ్ దత్ కూడా ఎన్టీఆర్ ను ముంబయ్ కి వచ్చినప్పుడు తన ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా కోరాడట.


ప్రస్తుతం ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా అనంతరం కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: