సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు ఎన్ని సినిమాలు తీసినా ఒక్కటీ కలిసిరాదు..అలా కలిసి రాక కనుమరుగైన నటీనటులు చాలా మంది ఉన్నారు. అయితే ఒక్క సినిమాతో సూపర్ హిట్ అందుకొని వరుస ఛాస్సులు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పూజా హెగ్డే ఒకరు.  వాస్తవానికి ఈ హాట్ బ్యూటీ ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. ఇక టాలీవుడ్ లో తనకు ఏదీ కలిసి రాదు అని బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది..కానీ అక్కడ కూడా నిరాశకే గురైంది.


అదే సమయంలో హరీశంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించి ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో పూజి హెగ్డే అదృష్టం పండింది. ఈ మూవీలో బికినీ సీన్ తో కుర్రాళ్ల మతులు మాత్రమే కాదు దర్శక, నిర్మాతల ను కూడా కలవర పెట్టింది.  ఆ ఒక్క సినిమా హిట్ తో పూజా హెగ్డే టాప్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.  ఎన్టీఆర్, మహేష్ బాబు మరోసారి అల్లు అర్జున్ తోనే కాదు...ప్రభాస్ తో ‘జాన్ ’ సినిమాలో నటిస్తుంది. అంతే కాదు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలా వైకుంఠపురములో నటిస్తుంది.


తాజాగా ఈ బ్యూటీకి అక్కినేని అబ్బాయి అఖిల్ సరసన నటిస్తుంది. అఖిల్ కన్నా మూడేళ్లు పెద్దదైన పూజా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుండడంతో అభిమానులు ఈ మూవీ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్, పూజా హెగ్డేలపై కోర్టు సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో ఇవి అత్యంత కీలక సన్నివేశాలని చిత్ర యూనిట్ చెబుతున్నారు.  మరి ఈ లక్కీ హీరోయిన్ తో అయినా అఖిల్ కి కలిసి వస్తుందో రాదో చూడాలి. గోపీసుందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: