కమెడియన్గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తరువాత నిర్మాతగా మారిన టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్. ఇటీవల మీడియాకు కాస్త దూరంగా ఉన్నా గతంలో ఈయన మంచి న్యూస్ మేకర్గా పేరుఉంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ చేసిన బ్లేడు కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ చేసాయి.బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించాడు . అయితే గోవిందుడు అందరివాడేలే లాంటి ఫ్లాప్ ని కూడా వచ్చింది.
అయినా అతడి ఆశ చావలేదు. రామ్ చరణ్ .. పవన్ ఎవరో ఒకరు ఈ సమయంలో ఆదుకోకపోరు అన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కమెడియన్ పాత్ర పోసొస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో గణేష్ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేశాయి.
నటుడిగా కొనసాగుతూనే మరోసారి నిర్మాణరంగం వైపు చూస్తున్నాడు గణేష్.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా
కృష్ణవంశీ దర్శకత్వంలో అప్పటిలో `గోవిందుడు అందరి వాడేలే` సినిమాను నిర్మించాడు బండ్ల గణేష్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకున్నా హిట్ టాక్ కు మాత్రం సొంతం చేసుకోలేదు. అయితే ఇప్పుడు మరోసారి తనకు నిర్మాతగా అవకాశం ఇవ్వాలని మెగా పవర్ స్టార్ను ట్వీట్టర్ ద్వారా వేడుకున్నాడు గణేష్.
మళ్లీ మీ తో ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకున్నాడు. మరి వరుస సినిమాలతో చాల బిజీగా ఉన్న రామ్ చరణ్ అతడి అభ్యర్థనను మన్నిస్తాడా? లేదో అన్నది చూడాలి మరి..