ఇండస్ట్రీ లో పేరున్న డైరెక్టర్ లు కొత్త కొత్త హీరో, హెరాయిన్లను పరిచియమ చేయడం సాధారణం. కానీ తాను ఎదుగుతూ కొత్త కొత్త డైరెక్టర్లకి, రచయితలకి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. తెలుగు సినిమా మూస పద్ధతి మార్చుకొని ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు హీరో  శ్రీ విష్ణు. అదేవిధంగా టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్నప్పటికీ కొత్త దర్శకులకే అవకాశం ఇస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు  శ్రీ విష్ణు.
 
సినిమా సినిమాకు కథ - క్యారెక్టర్ పరంగా తేడా ఉండేలా చూసుకుంటూ చిన్న హీరోల్లో బెస్ట్ అనిపించుకుంటున్నాడు కూడా. ఈ మధ్యనే నివేతా థామస్ తో చేసిన  'బ్రోచేవారెవరురా'తో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడు. 
ఇక ఈ కుర్ర హీరో నెక్స్ట్ సినిమాతో రచయిత హాసిత్ గోలి మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారబోతున్నాడు. హాసిత్ గోలి దర్శకుడు వివేక్ ఆత్రేయ దగ్గర రచయిత గా పనిచేశాడు. 
 
 
శ్రీ విష్ణు - వివేక్ కాంబినేషన్ లో వచ్చిన 'మెంటల్ మదిలో' - 'బ్రోచేవారెవరురా' సినిమాలకు రచనా సహకారం అందించాడు కూడా.
 దొరికిందే ఛాన్స్ గా 'బ్రోచేవారేవరురా' సమయంలోనే శ్రీ విష్ణు కి ఓ కథను వినిపించాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలనే ఎంచుకునే శ్రీ విష్ణు కి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు హాసిత్. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ సినిమాకు ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం 'తిప్పరా మీసం' అనే సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ పని చేస్తుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: