తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 లో రోజు రోజు కీ ఇంటి సభ్యుల మద్య వివాదాలు ముదిరిపోతున్నాయి. గతంలో నాగార్జున ఫినాలే మరికొద్ది రోజుల్లో ఉంది..ఇప్పటికైనా ఇంటి సభ్యులు ముసుగు తీసి ఆడండి..అల్లరి ఆటలు, కామెడీలు మానేయండి అని గట్టి వార్నింగే ఇచ్చారు. కానీ ఇంట్లో కొంతమంది మాత్రం ఇంకా తమ ముసుగు తీయలేదని కొన్ని సందర్భాలు చెప్పకనే చెబుతున్నాయి. బిగ్బాస్ పదకొండో వారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ వినూత్నంగా జరగడమేకాక రెండురోజులు కొనసాగింది.
‘రాళ్లే రత్నాలు’ అనే టాస్క్ లో ఎవరు ఎన్ని రాళ్లు ఎక్కువగా పోగు చేసుకుంటే వారు నామినేషన్ నుంచి బయట పడతారు..ఈ క్రమంలో ఒక్కొ ఇంటి సభ్యుల మద్య పోటీ నెలకొని సాధ్యమైనంత వరకు పోరాడారు. రాళ్లు పోగేసుకున్న వారు నామినేషన్ నుంచి తప్పించుకోగా టాస్క్లో వెనుకబడిన రాహుల్, మహేశ్, పునర్నవి, వరుణ్ ఒక్కొక్కరుగా డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇక ఇంటిసభ్యులు గత రెండురోజులుగా సాదాసీదాగా గడిపారు. ఈ టాస్క్ లో కడుపునిండా తిండి కూడా లేకుండా, కప్పుకోడానికి సరైన వస్త్రాలు లేక నానా కష్టాలు పడ్డారు. బిగ్బాస్ ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు దాదాపు కొట్టుకున్నంత పని చేసుకున్నారు.
ఒకరినొకరు నెట్టుకోవడం..తోసుకోవడం నానా బీభత్సం చేశారు. అయితే ఇక్కడ బాబా రియాక్ట్ అవడానికి ముందు వరుణ్ సీరియస్ అయ్యాడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకోగా మళ్లీ వరుణ్ వితికను బుజ్జగించాడు. కాగా నేటి ఎపిసోడ్లో వరుణ్, బాబా భాస్కర్కు గొడవ జరిగేలా ఉంది. ఇంట్లో ఉండాలని లేదు అంటూనే బాబా భాస్కర్ నామినేషన్ నుంచి తప్పించుకోడానికి బాగానే కష్టపడ్డాడు. అయితే ఈ మద్య బాబా
భాస్కర్ తన విశ్వరూపం చూపిస్తున్నారని..నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి భలే ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అంటున్నారు.