‘సాహో’ విడుదలకు ముందు ఆ చిత్రం గురించి హీరోయిన్ శ్రద్ధా కపూర్   మీడియా ముందు ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా అలాంటి సినిమాలో నటించడం తన అదృష్టం అంటూ మీడియా ముందు కామెంట్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  ‘సాహో’ ప్రమోషన్ లో ప్రభాస్ తో సమానంగా పాల్గొన్న శ్రద్దా కపూర్ ‘సాహో’ విజయం పై అదే విధం గా టాలీవుడ్ లో తన కెరియర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అయితే ‘సాహో’ పరాజయంతో ఈ బ్యూటీ ఆశలు అన్నీ ఆవిరి అయిపోవడంతో ఇప్పడు ఆమె ‘సాహో’ పేరు తలుచుకోవడానికే ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆమె లేటెస్ట్ గా ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమంలో ‘సాహో’ గురించి ఆ కార్యక్రమ హోస్ట్ అడిగిన ప్రశ్నల పై ఆమె ప్రవర్తించిన తీరు పూర్తిగా వివాదాస్పదంగా మారింది. 

దీనితో ప్రభాస్ అభిమానులు ఆమె పై తీవ్ర అసహనంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎదురుగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు కూర్చుని ఉండగా వేదిక మీద ఉన్న హోస్ట్ ‘సాహో’ సినిమాలో నటించడంలో మీ అనుభవం చెప్పండి అంటూ శ్రద్ధాని అడిగాడు. దానికి ఆమె బదులివ్వకుండా ఆడియన్స్ వైపు చూసి వాళ్లను పలకరించింది. వాళ్లు తనతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు అంటూ సంబంధం లేకుండా మాట్లాడింది. 

తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన హోస్ట్ ‘సాహో’ గురించి చెప్పండి అని మళ్లీ అడిగాడు. మళ్ళీ ఆమె ప్రేక్షకుల వైపు చూసింది. వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. ఎవరో ఐలవ్యూ అంటే లవ్యూ టూ అని బదులిచ్చి హోస్ట్ అడిగిన ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేసింది. అయితే హోస్ట్ తన పట్టు విడవకుండా మళ్ళీ ‘సాహో’ ప్రస్తావన తీసుకు వచ్చాడు. దీనితో సాహో? అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టిన శ్రద్ధ ఆడియన్స్ వైపు చూస్తూ మీరంతా ‘చిచ్చోరే’ సినిమా చూశారా అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. దీనితో ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రభాస్ అభిమానులు ఈబ్యూటీ ప్రభాస్ ‘సాహో’ ని అవమాన పరిచింది అంటూ మండిపోతున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: