తెలుగులో చిత్ర పరిశ్రమలో ఎవరి నోటా విన్నా కూడా ఒకటే మాట వినపడుతుంది సమంత.. ముద్దు ముద్దు మాటలతో షాక్ కి గురిచేసే అందంతో మరియు హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని, అక్కినేని వారి కోడలైంది. ఎవరైనా పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరమవుతారు అనుకుంటారు. అయితే, ఈమె మాత్రం పెళ్లయ్యాక వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.
సామ్ పెళ్లయ్యాక రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ వంటి సక్సెస్ చిత్రాల్లో నటించింది సమంత. ఆ సినిమాలు హిట్ అవ్వడంతో
సామ్ స్థాయి కూడా బాగా పెరిగింది. ఆమెతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలతో పాటుగా, హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఆమె బిజీగా ఉండటం వల్ల చాలా మంది దర్శకులు నిరాశకు గురయ్యారు. ఈ విదంగా చాలా సినిమాలు డేట్స్ వెనకకి వెళ్లాయి.
మాములుగా హీరోయిన్లు అంటే అందాన్ని చూపిస్తూ కుర్రాళ్లను హీటెక్కిస్తుంటారు. కానీ
సామ్ మాత్రం ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే ఆమె చూపిస్తుంది. ఇది ఇలా ఉండగా హీరోయిన్లు అంటే అందాన్ని చూపించడమే కాదు అని
రష్మిక మందన్న అంటుంది. ఒకప్పటిలాగా పాటల్లో మాత్రమే కనిపించే హీరోయిన్లు ఇప్పుడు కథలో కూడా బాగా కనిపిస్తున్నారు. అలానే చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
విషయానికొస్తే.. ఇప్పుడు
రష్మిక మందన్న కూడా ఇదే చేయబోతుంది. ఇప్పటికే ఛలో, గీతగోవిందం లాంటి సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. మొన్న వచ్చిన డియర్ కామ్రేట్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆమెకు ఆఫర్లు మాత్రం తగ్గలేదు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగస్థలం తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది.
సామ్ ఎలా కనిపించిందో అలానే కనిపిస్తుంది.