మెగాస్టార్
చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటి వరకు 151 సినిమాల్లో నటించారు. వాస్తవానికి ఆయన 150 సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ కి ముందు పది సంవత్సరాలు రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పారు. సొంత పార్టీ ప్రజారాజ్యం అప్పట్లో కాంగ్రెస్ లో విలీనం చేసి యూపీఏ ప్రభుత్వం కేంద్ర
మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ కి కష్టాలు రావడంతో తిరిగి వెండి తెరపై తన ద్వితీయ ప్రస్థానం మొదలు పెట్టాని చూశారు.
ఈ నేపథ్యంలో వివివినాయక్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన
విజయ్ మూవీ ‘కత్తి’ తెలుగు నేటివిటీకి తగ్గట్లు ‘ఖైదీ నెంబర్ 150’ గా తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరకాల కోరిక అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ తీయాలనే ఆలోచన ఆయన తనయుడు రాంచరణ్ కి రావడం..సురేందర్ రెడ్డి ఇందుకు పూర్తిగా సిద్దం కావడంతో ‘సైరా’ పట్టాలెక్కింది. ఎన్నో అవాంతరాలు దాటి నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
మొత్తానికి
చిరంజీవి కన్న కల నిజమైంది.. సైరా ప్రజల్లోకి వెళ్లింది. దాంతో మెగా ఫ్యామిలీఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్చరణ్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో
చిరంజీవి ఒదిగిపోయారని ఓ చరిత్ర కారుడి జీవితాన్ని ప్రజలకు చూపించారని అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా
రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ బాస్ బస్టర్ కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు.
తన తండ్రి తనను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫోటో చూస్తున్న అభిమానులు నిజంతా చిరుకి తనయుడిపై ఎంత వాత్సల్యం ఉందో తెలిసిపోతుంది.. పుత్రోత్సాహంతో ఉప్పోంగిపోతున్నారని ఫ్యాన్స్ తెగ సంబడరపడిపోతున్నారు.