టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. స్వరాజ్యం కోసం బ్రిటిష్ పాలకులను ఎదిరించిన తొలి వ్యక్తి అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత రామ్ చరణ్ ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కించడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా పలువురు ఇతర భాషల నటులు కూడా నటించారు. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు, నరసింహారెడ్డి గారి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఒదిగిపోయి నటించారని, ఇక కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన మరియు డైలాగ్స్ అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. 

అయితే ఓవర్ ఆల్ గా మాత్రం సినిమా యావరేజ్ అని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఈ సైరా సినిమాలో మంచి కథ, కథనాలు, నేపథ్యం ఉన్నప్పటికీ, దర్శకుడు సురేందర్ రెడ్డి వాటిని మరింతగా ప్రేక్షకుడికి చేరువ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటె బాగుండేదని అంటున్నారు. అయితే సినిమాలో విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్, యుద్ధ సన్నివేశాలు మాత్రం చాలా బాగున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కొద్దిరోజలుగా నా బయోపిక్ తీయాలని కొందరు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్న విషయం తనకు తెలుసునని, అయితే ఆ సినిమాలో హీరోగా రామ్ చరణ్ మాత్రం నటించకూడదని కొంత ఆశ్చర్యకరంగా మాట్లాడడం జరిగింది. నిజానికి చరణ్, నా బయోపిక్ లో నటించడానికి పర్ఫెక్ట్ గా సరిపోతాడని అయితే,  

నా పాత్రను చరణ్ పోషిస్తే, రాంచరణ్ జన్మించే సీన్‌లో తనను తానే పట్టుకొంటే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలానే అది స్క్రీన్ మీద చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే రాంచరణ్ చేయకూడదని అనుకొంటున్నాను. అయితే నా పాత్రను రాంచరణ్ పోషిస్తే దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడని భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం కొన్ని చిన్న సమస్యలు ఉన్నందున, చరణ్ ను ఆ పాత్రలో వద్దని నేను అనుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు. అయితే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ లలో ఎవరైనా నా పాత్ర పోషిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మరి రాబోయే రోజుల్లో మెగా బయోపిక్ లో ఎవరు నటిస్తారు అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: