తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ 'చాణక్య'. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. 'U/A ' సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఇక ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ఇండో - పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని.. ఈ చిత్రం అవుట్ ఫుట్ పై గోపీచంద్ చాల నమ్మకంగా ఉన్నాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్ - థియేట్రికల్ రైట్స్ కి భారీ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులకు 4 కోట్లు వస్తే.. అలాగే డిజిటల్ రైట్స్ కు అమెజాన్ 2 కోట్లు ఇచ్చిందట. అదేవిధంగా హిందీ డబ్బింగ్ రైట్స్ కి ఏకంగా రూ.9 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద నాన్ - థియేట్రికల్ రైట్స్ కింద చాణక్యకు 15 కోట్లు వరకూ గిట్టుబాటు అయిందట.
కాగా ఈ చిత్రం అవుట్ ఫుట్ పై గోపీచంద్ చాల నమ్మకంగా ఉన్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇక గోపీచంద్ తరువాత సినిమా రచ్చ ఫేమ్ సంపత్ నంది దర్శకుడిగా సీనియర్ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఇటీవలే ఓ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమన్నా మొదటిసారి గోపిచంద్ ప్రక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నేడు అధికారికంగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను హీరోహీరోయిన్ల పై క్లాప్ కొట్టి చిత్ర షూటింగ్ ప్రారంభించారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి మంచి మాస్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు.