తాజాగా సెన్సార్ బోర్డు కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కొద్దీ సేపటి కిత్రం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. ఇక ఈ సినిమా చూసిన బోర్డు సభ్యులు సినిమా బాగుందని ముఖ్యంగా అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ సినిమాలో హైలైట్ అని అన్నారని చిత్ర నిర్మాత అనిల్ సుంకర పేర్కొన్నాడు. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె కు తెలుగు లో ఇదే మొదటి సినిమా. గోపిచంద్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ , శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. మరి ఈ చిత్రం గోపిచంద్ కు ఏ రేంజ్ విజయాన్ని అందిస్తుందో చూడాలి.