లౌక్యం తరువాత  మ్యాచో హీరో  గోపిచంద్  జిల్ , సౌఖ్యం ,గౌతమ్ నంద, ఆక్సీజన్ , పంతం  సినిమాలతో వరుస పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో గోపి..  మినిమమ్ గ్యారెంటీ హీరో అన్న ట్యాగ్ పోగొట్టుకున్నాడు.  ఇక ఇప్పుడు ఈ హీరో చాణక్య తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తమిళ డైరెక్టర్  తిరు  తెరకెక్కించిన  ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలకానుంది. ఇప్పటికే  విడుదలైన ప్రచార చిత్రాలు  సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.  దీనితో పాటు ఇండస్ట్రీ  లో ఈ చిత్రం తప్పకుండా హిట్  అవుతుందనే  టాక్ వినిపిస్తుంది. 



తాజాగా సెన్సార్ బోర్డు కూడా ఇదే  విషయాన్ని వెల్లడించింది. కొద్దీ సేపటి కిత్రం ఈ చిత్రం  సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. ఇక ఈ సినిమా చూసిన బోర్డు సభ్యులు సినిమా బాగుందని  ముఖ్యంగా  అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ సినిమాలో  హైలైట్ అని అన్నారని  చిత్ర నిర్మాత  అనిల్ సుంకర పేర్కొన్నాడు. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు  యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 



హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ చిత్రం లో  మెహ్రీన్  హీరోయిన్ గా నటించగా  బాలీవుడ్  బ్యూటీ  జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనుంది.  ఆమె కు తెలుగు లో ఇదే మొదటి సినిమా.  గోపిచంద్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి  పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ , శ్రీ చరణ్  పాకాల సంగీతం అందించారు. మరి ఈ చిత్రం  గోపిచంద్ కు ఏ రేంజ్ విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: