ఈ మధ్యకాలంలో సినిమా రిలీజై తెరమీదికి వచ్చేదాకా ఎవరు ఏ పాత్రలో ఉన్నారనే విషయం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.అభిమాన నటుడి సినిమా వస్తుందంటే ఆ సినిమాలో ఇతర తారాగణం ఏంటి ఈ సినిమాకి సంబందించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆత్రుత అభిమానులు ఉండటం సహజం. 2.ఓ వంటి హాలీవుడ్ స్థాయి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శంకర్-యూనివర్సల్ స్టార్
కమల్ హాసన్ కాంబినేషన్ లో ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హీరోగా గతంలో వచ్చిన భారతీయుడు సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో కొంతకాలం క్రితం ఆ సినిమాకి సీక్వెల్ చేసేందుకు శంకర్ రంగంలోకి దిగాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్,
కాజల్ అగర్వాల్,
ప్రియా భవాని శంకర్,
ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఇప్పటికే కంఫామ్ అయ్యుంది. కానీ విల్లన్ విషయంలో మాత్రం ఏది తేలడం లేదు. మొదట్లో భారతీయుడికి-2 ప్రతినాయకుడి పాత్రలో హిందీ నటుడు
అజయ్ దేవగన్ నటిస్తారని ప్రకటించారు చిత్ర బృందం.
ఐతే
శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందెయ్.....కాబట్టి అనుకోకుండా బడ్జెట్ కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో
అజయ్ దేవగన్ ఈ సినిమా నుండి తప్పుకున్నారని అన్నారు. ఆ తరువాత ఆయన స్థానంలో మరోక హీరో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. పైగా ఈ మధ్యకాలంలో లో
అనిల్ కపూర్ చెన్నై వెళ్లినప్పుడు డైరెక్టర్
శంకర్ ను కలవడం, ఆ ఫొటోలు బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు.
ఐతే ఈ వార్తల్లో నిజం లేదని.......
అనిల్ కపూర్ ఏదో ప్రమోషనల్ ఈవెంట్ కోసం చెన్నై వెళ్లినప్పుడు డైరెక్టర్
శంకర్ ను మామూలుగానే కలిశారట, అంతేకానీ సినిమా కోసం కాదట. అంటే గతంలో
కమల్ హాసన్ తెలియాజేసినట్టు ఇందులో ప్రతినాయకుడి పాత్రలో
అజయ్ దేవగన్ నటిస్తారన్నమాట. ప్రముఖ
ప్రొడక్షన్
సంస్థ లైకా ఈ సినిమా నిర్మిస్తుండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరించారు.