విక్టరీ వెంకటేష్ - నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. డి.సురేష్ బాబు- విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమాని ప్రారంభించినప్పటి నుంచి అసలు ఏమాత్రం గ్యాప్ లు లేకుండా శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. అయినా ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి రాకపోవడానికి కారణమేంటా? అంటూ సినీ అనుమానాలు వచ్చాయి. అయితే అందుకు సరైన కారణం ఉందని తెలుస్తోంది.

వెంకీమామ కాన్వాసు అంతకంతకు పెరుగుతోంది. ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ ను ఎప్పుడో క్రాస్ చేసింది. ఇప్పటికే  55కోట్ల వరకు బడ్జెట్ ని ఖర్చు చేశారని తాజా సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవడం ఖాయం అన్న చర్చ ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది. అయితే అదుపు తప్పుతున్న బడ్జెట్ విషయంలో పీపుల్స్ మీడియా సంస్థ కొంత కంగారు పడుతుందని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు కాస్ట్ కటింగ్ విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయానికి వచ్చారట.

అయితే ఈ సినిమాకి ఎంచుకున్న కథాంశం చాలా పెద్ద స్పాన్ ఉన్నదన్న సంగతి ఇంతకముందే తెలిసిందే. పైగా దేశభక్తి నేపథ్యం.. నాగచైతన్య పాత్రలో ట్విస్టులు వంటివి చాలా ఆసక్తికరంగా ఉంటాయట. అయితే వెంకీ- చైతన్య రేంజును మించి బడ్జెట్ పెట్టడం సాహసమే అవుతుందని భావిస్తున్నారట నిర్మాతలు. అక్టోబర్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ కి వాయిదా పడుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రాశీఖన్నా- చైతూ కి జోడీగా, పాయల్ రాజ్ పుత్-వెంకీ కి జోడీగా నటిస్తున్నారు. ఇక వెంకీ ఎఫ్-2 తో చైతూ మజీలీ తో మాంచి కమర్షియల్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ఈ సినిమా ఇద్దరి జోష్ ని మరింత పెంచుతుందా లేదా చూడాలి. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: